Parliament Sessions | కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వచ్చే నెలలో ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Special Sessions) నిర్వహించనున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ (Pralhad Joshi ) గురువారం ట్విట్టర్ ద్వారా తెలిపారు.
‘సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకూ ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాం. అమృత్ కాల్లో భాగంగా పార్లమెంట్లో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని భావిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. అయితే , పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.
Special Session of Parliament (13th Session of 17th Lok Sabha and 261st Session of Rajya Sabha) is being called from 18th to 22nd September having 5 sittings. Amid Amrit Kaal looking forward to have fruitful discussions and debate in Parliament.
ಸಂಸತ್ತಿನ ವಿಶೇಷ ಅಧಿವೇಶನವನ್ನು… pic.twitter.com/xRfbGa2MBH
— Pralhad Joshi (@JoshiPralhad) August 31, 2023
Also Read..
Elon Musk | ట్విట్టర్లో ఇక ఆడియో, వీడియో కాల్ సదుపాయం : ప్రకటించిన మస్క్
G20 Summit | జీ20 సమ్మిట్కు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దూరం..!
Elections | జమ్మూకశ్మీర్లో ఏ క్షణమైనా ఎన్నికలకు సిద్ధమే : సుప్రీంకు తెలిపిన కేంద్రం