Vande Bharat Metro | దేశంలోనే మొట్టమొదటిసారి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన వందే భారత్ మెట్రో రైలు వచ్చేస్తోంది. ఈ రైలు మరికొన్ని రోజుల్లో దేశంలో పరుగులు తీసేందుకు సిద్ధమవుతోంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ మెట్రోరైలును నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ మెట్రో రైలుకు సంబంధించిన ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది.
రైల్వే ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణ సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ రైళ్లు పలు రాష్ట్రాల్లో సేవలందిస్తున్నాయి. ఇక ఈ వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో మెట్రో నగరాల మధ్య వందే మెట్రో రైళ్ల (Vande Bharat Metro)ను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వీటి ప్రయోగాత్మక పరుగును ఈ ఏడాది జులైలోనే పరీక్షించనున్నారు (Trial Run From July). ఈ నేపథ్యంలో తాజాగా ఈ మెట్రో రైలు ఫస్ట్లుక్ (First Look) బయటకు వచ్చింది. ఈ మెట్రో రైలుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ వందే భారత్ మెట్రో రైళ్లలో నాలుగేసి బోగీలు ఒక యూనిట్గా ఉండనున్నాయి. ఒక రైల్లో కనీసం 12 బోగీలు ఉంటాయి. అయితే, ఆయా మార్గాల్లో రద్దీ ఆధారంగా వీటిని 16 కోచ్లకు విస్తరించే అవకాశం ఉంటుంది. ఇక ఈ రైలు కోచ్లను పంజాబ్ (Punjab)లోని కపుర్తలా (Kapurthala)లోని ఒక రైలు కోచ్ ఫ్యాక్టరీ నిర్మించింది. మొదట్లో 50 రైళ్లను నిర్మిస్తామని, క్రమంగా వాటి సంఖ్యను 400కి పెంచనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. పరిధి పరంగా చూసుకుంటే వందే భారత్ మెట్రో 100 కి.మీ నుంచి 250 కి.మీల మధ్య ప్రయాణించగలదని సదరు వర్గాలు వెల్లడించాయి.
வந்தே பாரத் மெட்ரோ ரயில்#VandeBharatMetro #metropost pic.twitter.com/iRUYUtCevY
— Metropost (@metropostorg) April 30, 2024
Also Read..
Salman Khan | సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో ఉన్న నిందితుడు ఆత్మహత్య
China | చైనాలో కుప్పకూలిన రోడ్డు.. 19 మంది మృతి