న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను భారత్ స్వదేశానికి తరలిస్తోంది. ఈ తరలింపు ఆపరేషన్కు కేంద్రం ‘ఆపరేషన్ అజయ్ (Operation Ajay)’ అని పేరు పెట్టింది. ఈ ఆపరేషన్ అజయ్లో భాగంగా 212 మంది భారతీయులతో తొలి విమానం శుక్రవారం ఢిల్లీకి చేరుకుంది.
తొలి విమానంలో ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ప్రయాణికుల ఫొటోలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చీ ట్విటర్ (X) లో షేర్ చేశారు. తన పోస్టుకు ‘వెల్కమ్ టు ది హోమ్లాండ్ (Welcome to the homeland)’ అని భారతీయులను స్వాగతిస్తూ వెల్కమ్ నోట్ జతచేశారు.
కాగా, ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్రం బుధవారం ఆపరేషన్ అజయ్ కార్యక్రామానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా తొలి విమానంలో ఇవాళ 212 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు.
Welcome to the homeland!
1st #OperationAjay flight carrying 212 citizens touches down in New Delhi. pic.twitter.com/FOQK2tvPrR
— Arindam Bagchi (@MEAIndia) October 13, 2023