జార్ఖండ్లోని జెంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు వర్కర్లు గాయపడ్డారు. శనివారం ఉదయం 10ః 20 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. అయితే.. ఈ పేలుడు తర్వాత పెద్ద ఎత్తున మంటలు కూడా చెలరేగాయి.. అయితే ఈ మంటలు చెలరేగిన ప్రాంతంలో ఎలాంటి పనులు జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
అయితే ఈ ఘటనలో ఎవరూ మరణించలేదని టాటా స్టీల్ అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయం తెలియగానే ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
#WATCH Jharkhand | A fire broke out in a Coke plant of Tata Steel Factory in Jamshedpur due to an alleged blast in a battery. Five fire tenders at the spot, 2 labourers reportedly injured. pic.twitter.com/Y7cBhVSe1A
— ANI (@ANI) May 7, 2022