న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. న్యూఢిల్లీలోని (Delhi) సుల్తాన్పురిలో (Sultanpuri ) ఉన్న మురికి వాడల్లో (Slums) శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ఆ ప్రాంతమంతా విస్తరించడంతో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 15 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎవరూ గాయపడలేదని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు.
ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నదని డివిజనల్ ఫైర్ ఆఫీసర్ ఏకే జైశ్వాల్ (AK Jaiswal) తెలిపారు. 15 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశామన్నారు. ఇప్పటివరకు ఎవరికీ గాయాలవలేదని చెప్పారు. ఈ ఆపరేషన్లో రోబోలను (Robots) కూడా వినియోగించామని, అవి సమర్ధవంతంగా పనిచేశాయన్నారు.
Delhi | Fire breaks out in slums near Sultanpuri Road. More details are awaited. pic.twitter.com/2XMfCLQQ1t
— ANI (@ANI) March 2, 2023
15 fire tenders present at the spot. The situation is under control. Robots are also being used to extinguish the fire. No casualties reported so far: AK Jaiswal, Divisional Fire Officer, Delhi pic.twitter.com/pjaBYeLc6Z
— ANI (@ANI) March 2, 2023