న్యూఢిల్లీ, జూన్ 23: టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో మంటలు ఎగిసిపడ్డ ఘటన ముంబైలో చోటుచేసుకొన్నది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో టాటా మోటార్స్ స్పందించింది.
ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించింది. ఇప్పటివరకు ఆ కంపెనీ 30 వేలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయగా, ఇదే తొలి ఫైర్ ఘటన కావటం గమనార్హం.