న్యూఢిల్లీ: సోషల్ మీడియా.. ఒకదిక్కు ప్రపంచాన్ని ఎలుతున్న విజేత. ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఆక్రమించిన జగజ్జేత. ఉన్నచోటినుంచే ప్రపంచాన్ని చూసేందుకు దృశ్యాన్నిచ్చి కోట్ల మంది గొంతుకలా మారింది. ప్రత్యేకించి మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా నెట్వర్క్ ట్విట్టర్.. భావ స్వేచ్ఛ ప్రకటన వివాదాస్పదం అవుతున్నది.
గణతంత్ర దినోత్సవం నాడు రైతుల ట్రాక్టర్ పరేడ్ హింసాత్మకం కావడం.. రైతులకు అంతర్జాతీయ సెలబ్రిటీలు మద్దతు తెలుపడం చకచకా జరిగిపోయాయి. ‘రైతుల మారణ హోమం (Farmers genocide)’ అనే హ్యష్ ట్యాగ్ను జత చేశారు.
అంతర్జాతీయ పర్యావరణ కార్యకర్త గ్రేట్ థన్బర్గ్ మరో అడుగు ముందుకేసి రైతులకు మద్దతు తెలిపేందుకు విడుదల చేసిన టూల్కిట్ వివాదాస్పదమైంది. దీంతో రైతుల ఉద్యమంపై అంతర్జాతీయ సమాజం దృష్టి పడింది.
తాజాగా దేశంలో కోవిడ్-19 మహమ్మారి నివారణలో మోదీ సర్కార్ విఫలమైందని సోషల్ మీడియాలో క్రిటిక్స్ వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మోదీ సర్కార్ను నిలదీయడంతోపాటు భవిష్యత్ కార్యాచరణ రూపుదిద్దుకునేందుకు కాంగ్రెస్, ఇతర విపక్షాలు.. ట్విట్టర్లో టూల్కిట్ విడుదల చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
దేశ భద్రత, ప్రతిష్ఠను భంగం కలిగించేందుకు కాంగ్రెస్, ఇతర విపక్షాలు ఈ టూల్కిట్ విడుదల చేసిందని కేంద్రం, కేంద్రంలోని అధికార బీజేపీ ఆరోపించాయి. ఇంత వరకు బాగానే ఉంది..
ఈ ట్వీట్ను బీజేపీ అధికార ప్రతినిధి సాంబిత్ పాత్ర తదితరులు చేసిన రీ ట్వీట్లపై ట్విట్టర్ యాజమాన్యం మాన్యుపులేటెడ్ ట్వీట్స్ అని ముద్ర వేయడంతో అసలు కథ మొదలైంది. ఇది అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠను దెబ్బ తీస్తుందని కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో ఆందోళన ప్రారంభమైంది.
దీంతో ఈ మాన్యుపులేటెడ్ ట్వీట్స్ అనే ముద్రను తొలగించాలని కోరుతూ.. ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ కార్యాలయానికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. తనిఖీలు జరుపడం వివాదాస్పదమైంది.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గ్రెటా థన్బర్గ్ టూల్ కిట్ ట్వీట్.. తాజాగా కొవిడ్పై విపక్షాల పేరిట నకిలీ ట్వీట్తో ట్విట్టర్ చిక్కుల్లో పడింది.
భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ సోషల్ మీడియా రూపంలో తప్పుదారులు తొక్కుతున్నాయా? ఎవరైనా, ఏదైనా మాట్లాడొచ్చా? హద్దులు దాటే అక్షరాలకు, మితిమీరే మాటలకు మన చట్టం కళ్లెం వేయలేదా? అసలు చట్టాలు ఏం చెప్తున్నాయి అంటే..
భావప్రకటనాస్వేచ్ఛ.. వాక్ స్వాతంత్ర్యం.. రాజ్యాంగంలోని 19 (1ఏ) అధికరణం మనకు కల్పించిన ప్రాథమిక హక్కు. వ్యక్తిగా మనలోని భావాలను అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ఎప్పటికీ ఉంటుంది.
భావ స్వేచ్ఛ పేరిట సోషల్ మీడియాలో దేశ సమగ్రతకు వ్యతిరేకంగా, దేశ భద్రతకు ముప్పు వాటిల్లే వ్యాఖ్యలు చేయొచ్చా అంటే మన సమాజానికే నష్టం.
రోజురోజుకు టెక్నాలజీ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతున్న వేళ. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచమే ఓ కుగ్రామంగా మారింది. మారుమూలన జరిగిన ఘటన క్షణాల్లో తెలిసిపోతుంది.
అదే టైంలో వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకొనే సోషల్ మీడియా వేదికలు మన అరచేతిలో ఆటలాడుతున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, వాట్సాప్.. ఇలా వేదికలన్నీ అభిప్రాయాన్ని చెప్పుకొనే అవకాశాన్నిచ్చాయి.
హింస, ఉగ్రవాదం, హింసాత్మక వేర్పాటువాదం, బాలల లైంగిక దోపిడీ, దుర్భాషలు, ద్వేషం, వేధింపులకు పాల్పడే వ్యాఖ్యలను, పోస్టులను అనుమతించబోమని అవి షరతులు పెడ్తున్నాయి. ఆ షరతుల అమలుకు ఏయే అంశాలు ప్రతిపాదిక అవుతాయన్నది ప్రధాన ప్రశ్న.
సోషల్ మీడియా వేదికల షరతులపై ఈ ప్రశ్నలు తలెత్తడానికి బలమైన కారణాలే ఉన్నాయి. జనవరి 26, ఎర్రకోట వద్ద రైతుల ట్రాక్టర్ల పరేడ్ హింస. కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
కేంద్రం వైఖరిని నిరసిస్తూ జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు నిర్వహించిన ట్రాక్టర్ పరేడ్ హింసకు దారి తీసింది. ఈ పరేడ్లో కొందరు ఎర్రకోటపైకి ఎక్కి ఒక మతసంస్థ జెండాను ఆవిష్కరించడం, రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం జరిగింది.
రైతులకే తమ మద్దతు అంటూ కొందరు అంతర్జాతీయ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా గళం విప్పారు. ప్రపంచ పర్యావరణ హక్కుల కార్యకర్త గ్రెటా థన్బర్గ్, అమెరికా పాప్ సింగర్ రిహానా తదితర అంతర్జాతీయ సెలబ్రిటీలు స్పందించారు. భారత్లో రైతుల ఆందోళనలకు మద్దతుగా ట్వీట్లు చేశారు.
‘రైతుల మారణ హోమం (Farmers genocide)’ అనే హ్యష్ ట్యాగ్ను జత చేశారు. గ్రెటా థన్ బర్గ్ ఒక అడుగు ముందుకేసి రైతుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు టూల్ కిట్ విడుదల చేయడం వివాదాస్పదం అయ్యింది. దీంతో రైతుల ఉద్యమంపై అంతర్జాతీయ సమాజం దృష్టి పడింది.
గ్రేటా థన్బర్గ్ ట్వీట్ ప్రభావంతో భారత్, అంతర్జాతీయ సమాజానికి మధ్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం గ్రహించింది. ఫేక్ పోస్టులు, రెచ్చగొట్టే ట్వీట్లు చేసిన 1300కి పైగా ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేయాలని ట్విట్టర్ యాజమాన్యాన్ని ఆదేశించింది.
తొలుత తొలగించినట్లే తొలగించి మళ్లీ ఆ ఖాతాలను పునరుద్ధరించడం కేంద్రానికి కేంద్రానికి పుండుమీద కారం చల్లినట్లైంది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఘాటుగా స్పందించడంతో ఆ ఖాతాలను ట్విట్టర్ తొలగించడంతో వివాదం సద్దుమణిగింది.
ఇదే సమయంలో సోషల్ మీడియాను కట్టడి చేయడానికి కేంద్రం తాజాగా రూపొందించిన ఐటీ నిబంధనలు ఈ నెల 25వ తేదీన అమలులోకి వచ్చాయి. వీటి అమలుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ట్విట్టర్ మినహా ఇతర సోషల్ మీడియా వేదికలు కేంద్రానికి నివేదిక ఇచ్చాయి.
టెక్నాలజీతోపాటు సైబర్ మోసాలు, నేరాలు పెరిగిపోయాయి. వాటిని అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2000లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాన్ని తెచ్చింది. దీనికి కొనసాగింపుగా 2008లో తీసుకొచ్చిన సవరణలో 69ఏ సెక్షన్ చేర్చారు.
ఐటీ చట్టంలోని 69ఏ సెక్షన్ ప్రకారం రెచ్చగొట్టే, హింసను ప్రేరేపించే పోస్టులను నియంత్రించే అధికారం కేంద్రానిదే. ఫేక్ పోస్టులను తొలగించడం, ఆయా ఖాతాలను తొలగించాలని సోషల్ మీడియా వేదికలను కేంద్రం ఆదేశించొచ్చు.
దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రత, రక్షణతోపాటు విదేశాలతో స్నేహ పూర్వక సంబంధాల కొనసాగింపు, నేరాలకు ప్రేరేపించకుండా నిరోధించడానికి ఆయా వేదికలను ఆదేశించే అధికారం కేంద్రానికి ఉంది.
అయితే, ఎమర్జెన్సీ మాత్రమే ఆంక్షలను అమలు చేయాలని ఆదేశించడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ చైర్పర్సన్కు మాత్రమే అధికారాలు ఉన్నాయి.
ఈ ఆదేశాలపై తదుపరి సంబంధిత నిపుణుల కమిటీ చర్చించాల్సి ఉంటుంది. కానీ ఆచరణలో సోషల్ మీడియాలో పోస్టుల తీరును పర్యవేక్షించడానికి నిపుణుల కమిటీ ఉనికిలో లేదు.
రాజ్యాంగంలోని 19 (1) (ఏ) అధికరణం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉన్నట్లే, 19 (2) అధికరణం ఆమోదయోగ్యమైన ఆంక్షలను అనుమతిస్తుంది. 19 (2) అధికరణం కింద ఐటీ చట్టంలో 66ఏ, 69ఏ, 79 సెక్షన్లను చేర్చారు. వీటిపై ఎటువంటి న్యాయవ్యవస్థ పర్యవేక్షణకు అవకాశం లేదు.
79వ సెక్షన్ కింద ఆంక్షలను అమలు చేయడానికి ప్రభుత్వం ఎక్కువగా ప్రయత్నిస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే.. దేశీయంగా ఆంక్షలు విధించే అవకాశం, అధికారం కేంద్రానికి ఉంటాయి కానీ, విదేశాల్లో ఉంటూ చేసే పోస్టులు, ప్రచారాన్ని నిరోధించడం కేంద్రానికి సాధ్యం కాదు.
రాందేవ్ వ్యాఖ్యలపై ఆగని రగడ : చర్చకు రావాలని ఐఎంఏ సవాల్
అంత్యక్రియలు జరిపాక.. మనిషి తిరిగొచ్చాడు..! అసలేం జరిగిందంటే
బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్లకు ఇన్సూరెన్స్ ఉంటుందా ?
ప్రతి నెల గ్యాస్ బండ ధర మోతే.. ఇంకా..!