Priyanka Gandhi : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్పై కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆమె పతనంతిట్ట లోక్సభ నియోజకవర్గంలో పర్యటించారు. కేరళ ముఖ్యమంత్రి ‘రాజీ’ రాజకీయాలు చేస్తున్నారని ఈ సందర్భంగా ఆమె ఆరోపించారు.
లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కేరళ సీఎం కేవలం కాంగ్రెస్ పార్టీపైన, నా సోదరుడు రాహుల్గాంధీపైన మాత్రమే విమర్శలు చేస్తున్నారని, బీజేపీ ఊసే ఎత్తడం లేదని ప్రియాంక విమర్శించారు. లైఫ్ మిషన్, గోల్డ్ స్మగ్లింగ్ తదితర కుంభకోణాల్లో విజయన్ పాత్ర ఉన్నప్పటికీ కేంద్ర సర్కారు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు.
విజయన్ కేంద్రంతో రాజీకి రావడంతోనే కేంద్రం ఆయనపై చర్యలు తీసుకోలేదని ప్రియాంక విమర్శించారు. రాజీపడి ఆడే అటగాడు ఫుట్బాల్ మ్యాచ్ గెలువలేడని, అదేవిధంగా మీరు ఒక రాజీపడిన ముఖ్యమంత్రిగా ఎన్నికల్లో గెలువలేరని ఆమె ఎద్దేవా చేశారు.