Hyundai | చెన్నై, ఏప్రిల్ 19: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్.. గ్రామీణ బాటపట్టింది. గ్రామాల్లో ఉండేవారిని లక్ష్యంగా పెట్టుకొని ‘గ్రామీణ్ మహోత్సవ్’ పేరుతో దేశవ్యాప్తంగా 16 నూతన ప్రాంతాల్లో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మహోత్సవంలో కంపెనీకి చెందిన మాడళ్లను ప్రదర్శించడంతోపాటు లైవ్ మ్యూజిక్, ఫోక్ డ్యాన్స్లు, ప్రాంతీయంగా ఉండేవారిని ప్రోత్సహించే దిశగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.
ఈసారి వర్షాలు సాధారణ స్థాయి కంటే అధికంగా నమోదుకానున్నాయని, దీంతో ఆదాయ వనరులు పెరగనుండటం, మౌలిక సదుపాయాలు మెరుగవడంతో మొత్తం విక్రయాల్లో గ్రామీణ ప్రాంతం వాటా మరింత పెరిగే అవకాశం ఉన్నదన్నారు. మొత్తం అవుట్లెట్లలో 40 శాతం స్టోర్లు గ్రామీణ ప్రాంతాల్లోనే నెలకొల్పినట్లు చెప్పారు.