అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయొద్దని సంయుక్త కిసాన్ మోర్చా, కర్ణాటక రైతు, వ్యవసాయ కూలీల సంఘాలు రైతాంగానికి పిలుపు నిచ్చాయి.
‘మోదీ వంటి రైతు వ్యతిరేక నాయకుడు ప్రభుత్వంలో కొనసాగకూడదు. ఆయన చెప్పిన రైతుల ఆదాయం రెట్టింపు, ఫసల్ బీమా పథకం, కిసాన్ పథకాలు పెద్ద అబద్ధాలుగా తేలాయి. ఇలాంటి అవినీతి ప్రభుత్వం బారి నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం బీజేపీని ఓడించి తీరాలి’ అని కిసాన్ మోర్చా కోరింది.