న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: బీజేపీ నేతలు ప్రింటింగ్ షాపుల నుంచి తెచ్చుకొనే నకిలీ డిగ్రీలపై ఆధారపడతారని ఆప్ విమర్శించింది. తన పార్టీ నాయకుల విద్యార్హతల పట్ల బీజేపీకి ఆందోళన లేదని, అసలు పట్టించుకోదని ఎద్దేవా చేసింది. ప్రధాని మోదీ విద్యార్హతలపై వివాదం నేపథ్యంలో ఆప్ ‘మీ డిగ్రీ చూపించండి’ అనే సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించింది.
సోమవారం ఆప్ సీనియర్ నేత జాస్మిన్ షా మీడియాతో మాట్లాడుతూ ఆప్ రాజకీయాల మాడల్ విద్యకు ప్రాధాన్యం ఇస్తుందని, అదే బీజేపీ అయితే ప్రింటింగ్ షాప్ మాడల్ రాజకీయాలను అనుసరిస్తుందని విమర్శించారు. బీజేపీ నేతలు తమ డిగ్రీలను చూపించేందుకు నిరాకరించడంతో తాము ఈ ప్రచారాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రచారంలో భాగంగా జాస్మిన్ షా తన బీటెక్, ఎంటెక్ సర్టిఫికెట్లను చూపారు.