Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా రెండు తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ హింసకు ఇప్పుడప్పుడే తెరపడేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకీ మరింత క్షీణిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆర్మీ విశ్రాంత అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘నేను విశ్రాంత జీవితం గడుపుతోన్న మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఓ సాధారణ భారతీయుడిని. మణిపూర్ ని ఇప్పుడు ఎవరూ రాష్ట్రంగా గుర్తించట్లేదు. మణిపూర్ స్టేట్ లెస్ గా మారింది. ఇక్కడ లిబియా, లెబనాన్, నైజీరియా, సిరియా మాదిరిగా ఎప్పుడైనా, ఎవరివల్లైనా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించవచ్చు. ఇదంతా ఎవరైనా వింటున్నారా..?’ అంటూ ఆర్మీకి చెందిన విశ్రాంత అధికారి లెఫ్టినెంట్ జనరల్ ఎల్ నిషికాంత సింగ్ ( Lieutenant General L Nishikanta Singh) ట్వీట్ చేశారు.
నిషికాంత్ ట్వీట్ పై మరో రిటైర్డ్ ఆర్మీ చీఫ్ వీపీ మాలిక్ (VP Malik) స్పందించారు. మణిపూర్ కు చెందిన ఓ విశ్రాంత అధికారి నుంచి విచారకరమైన పిలుపు వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అత్యున్నత స్థాయిలో తక్షణ చర్యలు అవసరం అని అభిప్రాయపడ్డారు.
మణిపూర్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత నెలలో మైతీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా ప్రకటించింది. అయితే నాగా, కుకీ సామాజిక వర్గాలకు చెందిన వారు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో మే 3న మైతీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. నాటి నుంచి గత నెలకుపైగా రాష్ట్రంలో అల్లర్లు, హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటనల్లో సుమారు 120 మందికిపైగా పౌరులు మరణించారు. 350 మందికి పైగా గాయపడ్డారు. 50 వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయలయ్యారు.
An extraordinary sad call from a retired Lt Gen from Manipur. Law & order situation in Manipur needs urgent attention at highest level. @AmitShah @narendramodi @rajnathsingh https://t.co/VH4EsLkWSU
— Ved Malik (@Vedmalik1) June 16, 2023
Also Read..
Donald Trump | రెస్టారెంట్ లో బిల్లు కట్టకుండా జారుకున్న ట్రంప్.. నెట్టింట ట్రోల్స్
Cat | ఆ విమానాశ్రయంలో పిల్లికి ఉద్యోగం.. దాని పనేంటో తెలుసా..?
Manipur Violence | మణిపూర్లో చల్లారని హింస.. బీజేపీ నేతల ఇళ్లను తగలబెడుతున్న అల్లరి మూకలు