న్యూఢిల్లీ: ఆకర్షణీయమైన ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినవారి వలలో పడి మోసపోయిన 17 మంది భారతీయులు తిరిగి స్వదేశానికి బయల్దేరినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ శనివారం తెలిపారు.
వీరిని స్వదేశానికి రప్పించేందుకు లావోస్లోని ఇండియన్ ఎంబసీ అధికారులు చేసిన కృషిని ప్రశంసించారు.