కోల్కతా: పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య (77) ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని వైద్యులు తెలిపారు. కరోనా మహమ్మారి బారినపడ్డ ఆయనను ఇటీవలే కోల్కతాలోని ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నా ఇంకా పూర్తిగా కోలుకోలేదని, శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బందిపడుతున్నారని వైద్యులు చెప్పారు.
ప్రస్తుతం బుద్ధదేవ్ మాట్లాడుతున్నారని, మనుషులను గుర్తుపడుతున్నారని వైద్యులు వెల్లడించారు. ఆయన ఆక్సిజన్ శాచ్యురేషన్ 92 శాతం ఉందని, ప్రస్తుతం ఆక్సిజన్ సపోర్ట్పైనే ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం పొడిదగ్గు కొంత ఉందని, హార్ట్ రేట్ 60గా ఉందని చెప్పారు. రక్తపోటు సహా అన్నీ సాధారణ స్థితిలోనే ఉన్నాయన్నారు. కాగా, బుద్ధదేవ్ భట్టాచార్య ఈ నెల 18న కరోనా బారినపడ్డారు.