న్యూఢిల్లీ : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరాకు మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. బెంగాల్లో జరిగిన బొగ్గు కుంభకోణం కేసులో వీరిద్దరికి నోటీసులు జారీ చేసినట్లు ఈడీ వెల్లడించింది. వచ్చే వారం విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. అభిషేక్ బెనర్జీ, రుజిరాను వేర్వేరుగా విచారించనున్నారు.
అయితే ఈడీ విచారణ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని అభిషేక్ దంపతులు ఇటీవలే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్ను కొట్టేసిన ఐదు రోజులకే ఈడీ.. అభిషేక్ దంపతులకు మరోసారి నోటీసులు జారీ చేసింది.
బెంగాల్లో కునుస్తోరియా, కజోరా ప్రాంతాల్లోని ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ బొగ్గు గనులున్నాయి. బొగ్గు గనుల్లో బొగ్గును అక్రమంగా తవ్వుకుకుని అమ్ముకున్నారని సీబీఐ కేసు పెట్టింది.య దీంతో 2020, నవంబర్లో సీబీఐ బొగ్గు స్కాంపై కేసు నమోదు చేసింది.
Enforcement Directorate (ED) summons TMC national secretary Abhishek Banerjee and his wife Rujira Banerjee next week, in connection with an alleged coal scam
(file photo) pic.twitter.com/V1KJB0SDWy
— ANI (@ANI) March 17, 2022