Operation Chhatru | జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లో ఆపరేషన్ ఛత్రు (Operation Chhatru) కొనసాగుతోంది. కిస్త్వార్ (Kishtwar) జిల్లాలోని ఛత్రు ప్రాంతంలో ఉగ్రవాదులు (Terrorists) నక్కి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా దళాలు (Security Forces) ఇవాళ ఉదయం నుంచి కూంబింగ్ నిర్వహించారు. జమ్ము కశ్మీర్ పోలీసులు, సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బుధవారం తెల్లవారుజామున నుంచి సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన భద్రతా దళాలు.. వారిని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో అక్కడ ఎదురు కాల్పులు (Encounter) చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
#WhiteKnightCorps | Contact with Terrorists | Op Chhatru
In an intelligence based operation, in concert with @JmuKmrPolice, in early morning hours today, alert troops of #WhiteKnightCorps have established contact with terrorists in general area of Chhatru. Fire exchanged with…
— White Knight Corps (@Whiteknight_IA) November 5, 2025
Also Read..
Train | యూపీలో ఘోర ప్రమాదం.. పట్టాలు దాటుతున్న యాత్రికులను ఢీకొన్న రైలు
Earthquake | ఇండోనేషియాని వణికించిన భారీ భూకంపం.. వారం వ్యవధిలో రెండోసారి