అడవుల్లో ఉండే ఏనుగులు జనావాసాల్లోకి ఎందుకు వస్తాయి? అని ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? ఆహారం కోసం వెతుక్కుంటూ వస్తాయంటాం. లేదంటే వాటి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ కాబట్టి అడవిలో ఎవరైనా వాటిపై దాడి చేసుంటే పగ తీర్చుకోవడానికి వచ్చాయని చెప్తాం. ఎందుకంటే అలాంటి ఘటనలు కూడా చాలా జరిగాయి మరి.
కానీ ఈ ఏనుగు అలాంటిది కాదు. అందుకే చిన్నపిల్లలు ఆడుకునే పార్కులోకి వచ్చి అది కూడా ఆడుకుంటూ ఎంజాయ్ చేసింది. అందుకే ఆ పార్కుకు వచ్చినట్లుందా మూగజీవం. చిన్నారుల కోసం టైర్లతో ఏర్పాటు చేసిన ఉయ్యాలల మధ్య తిరుగుతూ.. వాటిని కాళ్లతో తంతూ ఎంజాయ్ చేసింది. ఈ ఘటన అస్సాంలోని గువాహటిలో వెలుగు చూసింది.
ఇక్కడి నారండీ ఆర్మీ కంటోన్మెంట్లో ఒక చిల్డ్రన్స్ పార్క్ ఉంది. దాని పక్కనే ఆంచంగ్ వైల్డ్లైఫ్ శాంక్చువరీ ఉంది. దానిలో నుంచే ఆ ఏనుగు అక్కడకు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. అయితే అది ఎవరినీ ఏం చెయ్యలేదు. అలా పార్కులో ఆడుకుంటూ కొంత మంది కంట పడింది. వాళ్లు దీన్ని కెమెరాలో బంధించడంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
కాగా, కొన్ని రోజుల క్రితం ఇదే మిలటరీ క్యాంప్లోకి ఒక ఏనుగు దూసుకొచ్చింది. ఆ సమయంలో అక్కడ కొందరు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఈ ఏనుగు కూడా ఆంచంగ్ శాంక్చువరీ నుంచే వచ్చింది. వచ్చీ రావడంతోనే తను కూడా ఆటలో జాయిన్ అయ్యేందుకు ప్రయత్నించింది. ఒక వ్యక్తి తన వైపు బంతిని తంతే.. ఇది కూడా రిటర్న్ కిక్ ఇచ్చింది. అనంతరం ‘వెళ్లొస్తా’ అన్నట్లుగా తొండం పైకెత్తి చూపిస్తూ వెళ్లిపోయింది.
#WATCH | A wild elephant from Amchang Wildlife Sanctuary played & enjoyed as the animal stepped into a children's park in Narangi Army Cantt in Assam's Guwahati. pic.twitter.com/FCcKWWLhJ8
— ANI (@ANI) October 16, 2022