న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారీగా ఎలక్టోరల్ బాండ్లు అమ్ముడుపోయాయి. ఏకంగా రూ.1000 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్ల విక్రయాలు జరిగినట్టు ఎస్బీఐ తెలిపింది.
వీటిలో హైదరాబాద్లో రూ.359 కోట్లు, ముంబైలో రూ.259 కోట్లు, ఢిల్లీలో రూ.182 కోట్లు అమ్ముడైనట్టు తెలిపింది.