EC | న్యూఢిల్లీ, మార్చి 21: ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసేందుకు వికసిత్ భారత్ సంపర్క్ కార్యక్రమం కింద ప్రజలకు బల్క్ వాట్సాప్ మెసేజ్లను పంపటం తక్షణమే నిలిపేయాలని కేంద్రాన్ని ఎన్నికల సంఘం గురువారం ఆదేశించింది. దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు వెల్లువెత్తటంతో ఈ చర్యలు తీసుకున్నది.
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో మార్చి 16న ఎన్నికల కోడ్ అమల్లోకి రాకమునుపే ప్రధాని నరేంద్ర మోదీ లేఖతో పాటు సందేశాలు పంపినట్టు సంబంధిత మంత్రిత్వ శాఖ ఎన్నికల సంఘానికి తెలిపింది. అయితే నెట్వర్క్ సమస్యల వల్ల కొన్ని మెసేజ్లు ఆలస్యంగా డెలివరీ అయ్యే అవకాశముందని వివరణ ఇచ్చుకున్నది. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వారిలో తృణమూల్ కాంగ్రెస్ కూడా ఉన్నది. అలాగే మంగళవారం చండీగఢ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ బల్క్ వాట్సాప్ మెసేజ్లకు సంబంధించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.