Election Bonds : ఎలక్టోరల్ బాండ్స్ను సర్వోన్నత న్యాయస్ధానం రద్దు చేయడంతో బీజేపీపై పెను ప్రభావం పడనుంది. 2016 నుంచి 2022 మధ్య ఈ స్కీమ్ కింద రాజకీయ పార్టీలకు సమకూరిన విరాళాల్లో 60 శాతం పైగా కాషాయ పార్టీకే లభించాయి. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.
ఇక 2016 నుంచి 2022 వరకూ విక్రయించిన ఎలక్టోరల్ బాండ్స్ విలువ రూ. 16,437 కోట్లు కాగా బీజేపీకి మొత్తం విరాళాల్లో 60 శాతం పైగా రూ. 10,122 కోట్లు సమకూరాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మొత్తం విరాళాల్లో 10 శాతం రూ. 1547 కోట్ల విరాళాలను స్వీకరించింది. పశ్చిమ బెంగాల్ పాలక తృణమూల్ కాంగ్రెస్ 8 శాతంతో రూ. 823 కోట్ల విరాళాలను స్వీకరించింది.
ఈ జాబితాలో 30 పార్టీలకు అందిన విరాళాలతో పోలిస్తే బీజేపీ ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన మొత్తం మూడు రెట్లు అధికం కావడం గమనార్హం. ఇంకా ఈ జాబితాను పరిశీలిస్తే సీపీఎం రూ. 360 కోట్లు, ఎన్సీపీ రూ. 231 కోట్లు, బీఎస్పీ రూ. 85 కోట్లు, సీపీఐ రూ 13 కోట్లు ఎన్నికల బాండ్ల ద్వారా సమీకరించాయి.
Read More :
Sonia Gandhi | అందుకే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. రాయ్బరేలీ ప్రజలకు సోనియా లేఖ