Rain | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఎల్నినో పరిస్థితులు ఈ ఏడాది జూన్ నాటికి బలహీనం అవుతాయని, ఫలితంగా భారత్లో వచ్చే రుతు పవన కాలంలో సమృద్ధిగానే వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చూపుతున్న ఎల్నినో పరిస్థితుల బలహీనం ప్రారంభం అయిందని, ఆగస్టు నాటికి లానినా పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నదని తాజాగా పేర్కొన్నారు.
గత ఏడాది కంటే ఈసారి రుతుపవన వర్షాలు మెరుగ్గానే పడుతాయని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ రాజీవన్ పేర్కొన్నారు. నైరుతి రుతు పవనాల సమయంలో పడే వర్షాలు దేశ వ్యవసాయ రంగానికి కీలకమైన విషయం తెలిసిందే.