గువాహటి: మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండే (Eknath Shinde) ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేశారు. తన అనుచరులతో కలిసి మంగళవారం గుజరాత్లోని సూరత్ వెళ్లారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత అసోంకు తన శిభిరాన్ని మార్చారు. బుధవారం తెల్లవారుజామున గువాహటి విమానాశ్రయానికి చేరుకున్న ఏక్నాథ్ షిండే.. తన వెంట మొత్తం 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించారు. బాలాసాహెబ్ ఠాక్రే కోరుకున్న హిందుత్వను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విమానాశ్రయంలో శివసేన చీలిక వర్గానికి బీజేపీ ఎమ్మెల్యే సెశాంతా బెర్గొహైన్ స్వాగతం పలకడం విశేషం.
#WATCH | "A total of 40 Shiv Sena MLAs are present here. We will carry Balasaheb Thackeray's Hindutva," said Shiv Sena leader Eknath Shinde after arriving in Guwahati, Assam pic.twitter.com/YpSrGbJvdt
— ANI (@ANI) June 22, 2022
శివసేన ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే పార్టీ అధినేత, సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన విషయం తెలిసింది. తన వర్గానికి చెందిన 40 ఎమ్మెల్యేలతో ఆయన గువావాహటి చేరుకున్నారు. వీరిలో 33 మంది శివసేన ఎమ్మెల్యలే, ఏడుగురు స్వంతంత్రులు ఉన్నారు. దీంతో ఉద్ధవ్ నేతృత్వంలోని ఎంవీఏ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పార్టీలో తిరుగుబాటు నేపథ్యంలో సీఎం నేడు మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితులపై చర్చించే అవకాశం ఉన్నది.
Assam: Shiv Sena leader Eknath Shinde and other party MLAs reach Guwahati airport from Surat, Gujarat. pic.twitter.com/Z8r0bfjejy
— ANI (@ANI) June 22, 2022
కాగా, మహారాష్ట్ర శాసనసభలో ప్రస్తుతం 287 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఎంవీఏ కూటమికి 152 మంది (శివసేన 55, ఎన్సీపీ 53, కాంగ్రెస్ 44), ప్రతిపక్ష బీజేపీకి 135 మంది సభ్యులు ఉన్నారు. అయితే షిండే తిరుగుబాటుతో ఎంవీఏ బలం 112కు పడిపోయింది (షిండే తనతో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించారు). వారంతా బీజేపీకి మద్దతిస్తే ఆ పార్టీ బలం 175కు చేరుతుంది.
#WATCH | A group of Maharashtra MLAs arrives at Radisson Blu Hotel in Guwahati, Assam. Shiv Sena leader Eknath Shinde, upon arrival in Guwahati, said that 40 Shiv Sena MLAs are present here.
Shinde & some other MLAs were unreachable after suspected cross-voting in MLC polls. pic.twitter.com/Fxdd4d5nlC
— ANI (@ANI) June 22, 2022