న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు పంపింది. ఈ కేసులో ఈడీ నుంచి కేజ్రీవాల్కు సమన్లు జారీకావటం ఇది 6వ సారి. ఫిబ్రవరి 19న ఏజెన్సీ కార్యాలయంలో విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాలని సమన్లలో ఈడీ పేర్కొన్నది.
కేజ్రీవాల్ దర్యాప్తునకు హాజరుకాకపోవటాన్ని ప్రశ్నిస్తూ ఈడీ కొద్ది రోజుల క్రితం ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై ఫిబ్రవరి 17న తమ ముందు హాజరుకావాలని కోర్టు సీఎం కేజ్రీవాల్ను ఆదేశించింది. ఈ ఏడాది జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2, గత ఏడాది నవంబర్ 2, డిసెంబర్ 21న ఈడీ నుంచి కేజ్రీవాల్కు సమన్లు జారీ అయ్యాయి. ఈ నోటీసులు చట్టవిరుద్ధమంటూ ఆయన వాటిని తిరస్కరిస్తున్నారు.