న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ర్టాల శాసనసభ ఎన్నికలను వచ్చే సంవత్సరం ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొన్నది. యూపీ, ఉత్తరాఖండ్లోని మంచు కురవని ప్రాంతాలు, పంజాబ్, గోవాలో జన గణనను ముందుగా జరుపాలని నిర్ణయించిన తర్వాత ఈ రాష్ర్టాల ఎన్నికల నిర్వహణపై ఈసీ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తున్నది.
మణిపూర్ అసెంబ్లీ కాల పరిమితి 2027 మార్చి 13న ముగుస్తుంది. గోవాలో ఈ కాల పరిమితి మార్చి 14న, పంజాబ్లో మార్చి 16న, ఉత్తరాఖండ్లో మార్చి 28న, ఉత్తరప్రదేశ్లో మే 22న ముగుస్తుంది. అసెంబ్లీ పదవీ కాలం ముగిసే తేదీకి ఆరు నెలల ముందే ఎన్నికలు నిర్వహించే గత పద్ధతికి అనుగుణంగా ఈసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నది. యూపీలో బహుళ దశల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉన్నది. ఎన్నికల తేదీలను వచ్చే సంవత్సరం జనవరిలో ప్రకటించే అవకాశం కనిపిస్తున్నది.