SIR : తెలంగాణలో మరోసారి ‘సర్’ (SIR) గడువును ఎన్నికల సంఘం పొడిగించింది. ఆఖరు తేదీ సమీపిస్తున్న వేళ ఓటరు జాబితాలో సవరణలు చేసుకునేందుకు అక్టోబర్ 7వ తేదీ వరకూ అవకాశమిచ్చింది. సర్ నోటీసులకు ధ్రువపత్రాలను సమర్పించి తమ ఓటును కాపాడుకునేందుకు ఈ గడువు ఇచ్చింది. నవంబర్ 9వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని ఈసీ వెల్లడించింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు.
ఓటర్ జాబితాలో పేరున్నా.. సర్ నోటీసులు అందుకున్ను వారికి ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మరోసారి సర్ గడువును పొడిగించింది ఈసీ. సర్ నోటీసులు, అభ్యంతరాల స్వీకరణ, బీఎల్వోలకు ధ్రువపత్రాల సమర్పణలో జాప్యం జరుగుతున్నందున తుది గడువును అక్టోబర్ 7వ తేదీ వరకూ పెంచింది. సర్ నోటీసులు, ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణకు నవంబర్ 5వ తేదీ వరకు సమయమిచ్చింది. నవంబర్ 9వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది.
తెలంగాణలో SIR గడువు పొడిగింపు
అక్టోబర్ 7 వరకు గడువు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
నవంబర్ 9న తుది ఓటర్ జాబితా ప్రకటన https://t.co/na0OAakFE2 pic.twitter.com/FBMsEvvKVX
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026