ముంబై: పార్టీల పేర్లు మార్చే అధికారం ఎన్నికల కమిషన్ (EC)కు లేదని మహారాష్ట్ర (Maharashtra) మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray) అన్నారు. ఈసీకి పార్టీ ఎన్నికల గుర్తు (electoral symbol) మాత్రమే కేటాయించే పవర్ ఉందని చెప్పారు. శివసేన (Shiv Sena) అనే పేరును తన తాత కేశవ్ థాక్రే (Keshav Thackeray) ఇచ్చారని, దానిని మరొకరు తస్కరిస్తామంటే తాము ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. ఆ పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఎలా మారుస్తుందని ప్రశ్నించారు.
2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన శివసేన.. ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే తర్వాత ఆ పార్టీతో విభేదించి కాంగ్రెస్ (Congress), ఎన్సీపీతో (NCP) కలిసి మహావికాస్ అఘాడీ (MVA) ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్టీ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే (Eknath Shinde) పార్టీని చీల్చడంతో ఎంవీఏ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం ఆయన బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. దీంతో సీఎం ఏక్నాథ్ నేతృత్వంలోని వర్గానికి శివసేన (షిండే) పేరును.. విళ్లు బానం గుర్తును, అదేవిధంగా ఉద్ధవ్ వర్గానికి శివసేన (ఉద్ధవ్) పేరును కాగడా గుర్తును ఎన్నికల సంఘం కేటాయించిన విషయం తెలిసిందే.