Earthquake | హిమాలయ దేశం నేపాల్ (Nepal)ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. గత శుక్రవారం రాత్రి నేపాల్లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూ ప్రకంపనల కారణంగా సుమారు 150 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత శనివారం మధ్యాహ్నం కూడా మరోసారి 3.6 తీవ్రతతో భూమి కంపించింది. తాజాగా అక్కడ మరోసారి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సోమవారం సాయంత్రం 4:16 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది.
ఈ భూకంపం ధాటికి దేశరాజధాని ఢిల్లీలోనూ బలమైన భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కార్యాలయాలు, ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. మూడు రోజుల్లో ఢిల్లీలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం ఇది రెండో సారి. వరుస భూకంపాలతో ఢిల్లీ దాని పరిసర ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
శుక్రవారం నేపాల్లోని వాయువ్య ప్రాంతంలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రివేళ 11.32 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 6.4గా నమోదయిందని నేషనల్ ఎర్త్క్వేక్ మెజర్మెంట్ సెంటర్ (NEMC) తెలిపింది. ఈ ఘటనలో సుమారు 150 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. ఈ భూకంపం ధాటికి ఉత్తర భారతదేశంలోనూ (North India) ప్రకంపనలు (Tremors) వచ్చాయి. శుక్రవారం రాత్రి 11.32 గంటలకు ఢిల్లీ, ఢిల్లీ-ఎన్సీఆర్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
Earthquake measuring 5.6 on the Richter scale struck Nepal at 1616 hours today, says National Center for Seismology (NCS).
— ANI (@ANI) November 6, 2023
Strong earthquake tremors felt in Delhi pic.twitter.com/wZmcnIfH1u
— ANI (@ANI) November 6, 2023
Also Read..
Rashmika Mandanna | రష్మిక డీప్ఫేక్ వీడియో.. కేంద్ర ఐటీ విభాగం ఏమందంటే..?
Rahul Gandhi | కేదార్నాథ్ ఆలయంలో రాహుల్.. భక్తులకు టీ అందించిన కాంగ్రెస్ నేత