శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో భూమి స్వల్పంగా కంపించింది. కశ్మీర్లోని పహల్గామ్లో (Pahalgam) బుధవారం ఉదయం 5.43 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. పహల్గామ్కు 15 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.
కాగా, ఈ నెల 5న కశ్మీర్ లోయ సహా జమ్మ డివిజన్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఫిబ్రవరి 5న ఉదయం 9.45 సమయంలో 5.9 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయని ఎన్సీఎస్ తెలిపింది. భూకంప కేంద్రం 180 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు గుర్తించింది.