భోపాల్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో (Indore) స్వల్ప భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 4.53 గంటల సమయంలో ఇండోర్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 3.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. ఇండోర్కు 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని పేర్కొన్నది. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.