కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దసరా పండగ నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న దుర్గా పూజ మండపాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఒక పండల్ వద్ద సీఎం మమతా బెనర్జీని పోలిన దుర్గా మాతా విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. విగ్రహానికి ఉన్న ప్రతి చేయి ఒక్కో ప్రభుత్వ పథకానికి ప్రాతినిధ్యం వహిస్తుందని బాగుయాటి నజ్రుల్ పార్క్ ఉన్నాయన్ సమితి అధ్యక్షుడు ఇంద్రనాథ్ బాగుయ్ తెలిపారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు సీఎం మమతను పోలిన దుర్గా విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.