ముంబై: ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఏ320 విమానంలో సాంతికేక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని ముంబై విమానాశ్రయానికి మళ్లించారు. విమానంలోని హైడ్రాలిక్ సిస్టంలో సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు. విమానం క్షేమంగా ల్యాండ్ అయిందని, అందులో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని చెప్పారు. విమానంలో 143 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు.
ఇలాంటి ఘటనే ఈ నెల 2న కూడా జరిగింది. డిసెంబర్ 2న కన్నౌర్ నుంచి దోహా వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ముందుజాగ్రత్తగా విమానాన్ని ముంబైకి మళ్లించారు. ఇండిగో ఎయిర్బస్ విమానంలో ఎల్లో హైడ్రోజన్ లీక్ అయిందనీ, దీనికారణంగా విమానాన్ని దారి మళ్లించామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారులు తెలిపారు.