భువనేశ్వర్: ఒక వ్యక్తి సుత్తితో కొట్టి తన తల్లిదండ్రులను హత్య చేశాడు. రక్తం మడుగుల్లో పడి ఉన్న వారి మృతదేహాల వద్ద రాత్రంతా గడిపాడు. (Man Kills Parents With Hammer) ఉదయం స్థానికులు ఇది చూసి షాక్ అయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ధోనాపాల్ గ్రామానికి చెందిన 55 ఏళ్ల హిమాన్షు ఆటో డ్రైవర్. అతడు మద్యానికి బానిసై ఇంట్లో గొడవపడటంతో భార్య, పిల్లలు చాలా కాలంగా విడిగా నివసిస్తున్నారు.
కాగా, మంగళవారం రాత్రి హిమాన్షు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. వృద్ధ తల్లిదండ్రులైన 81 ఏళ్ల హదిబంధు సాహు, 72 ఏళ్ల శాంతి సాహుతో గొడవ పడ్డాడు. ఆగ్రహంతో రాళ్లు పగులగొట్టే పెద్ద సుత్తితో వారిని కొట్టాడు. దీంతో రక్తం మడుగుల్లో పడి తల్లిదండ్రులు మరణించారు. అయితే వారి మృతదేహాల వద్దనే రాత్రంతా అతడు కూర్చొన్నాడు.
మరోవైపు బుధవారం ఉదయం స్థానికులు ఇది చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. వృద్ధ దంపతుల మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు హిమాన్షును అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Mamata Banerjee | బెంగాలీల పట్ల బీజేపీ వైఖరికి సిగ్గుపడుతున్నా: మమతా బెనర్జీ
Watch: ఫొటో కోసం పోజులియ్యపోయిన ఆలయ కమిటీ చైర్మన్.. తర్వాత ఏం జరిగిందంటే?