హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కస్టమ్స్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) సీజ్ చేసిన రూ.468.02 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.40 లక్షల విలువైన విదేశీ సిగరెట్లను మంగళవారం ధ్వంసం చేశారు. నైజీరియా, టాంజినియా, సౌతాఫ్రికా తదితర దేశాల నుంచి డ్రగ్ స్మగ్లింగ్ చేస్తూ శంషాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులకు గతంలో పలువురు చిక్కారు. స్మగ్లర్ల నుంచి 216.69 కిలోల డ్రగ్ను అధికారులు సీజ్ చేశారు. ఇందులో హెరాయిన్ (27.91), మెఫెడ్రోన్ (136.28), గంజా (52.5) ఉన్నాయి. వీటి విలువ మార్కెట్లో రూ.468.02 కోట్లు ఉంటుందని అదనపు కమిషనర్ డాక్టర్ డీ గాంధీ తెలిపారు. డ్రగ్తోపాటు విదేశీ సిగరెట్లను దుండిగల్లోని హైదరాబాద్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్లో ధ్వంసం చేసినట్టు అధికారులు తెలిపారు.