భోపాల్: డ్రగ్స్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు రైడ్ చేశారు. రూ.1,800 కోట్లకుపైగా విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. (drugs seized) ఇద్దరు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ సంఘటన జరిగింది. భోపాల్ సమీపంలోని ఫ్యాక్టరీలో మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో గుజరాత్కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)తో కలిసి సంయుక్తంగా ఆ ఫ్యాక్టరీపై రైడ్ చేశారు. ఆ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న ఎండీ (మెఫెడ్రోన్) డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్టరీలో అక్రమంగా మత్తు పదార్థాలు ఉత్పత్తి చేస్తున్న ఇద్దరు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు.
కాగా, గుజరాత్ హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ ఈ విషయాన్ని ఎక్స్లో పేర్కొన్నారు. ఈ రైడ్కు సంబంధించిన ఫొటోలను కూడా అందులో పోస్ట్ చేశారు. డ్రగ్స్పై పోరాటంలో భారీ విజయం సాధించిన గుజరాత్ ఏటీఎస్, ఢిల్లీ ఎన్సీబీని ఆయన అభినందించారు. మాదకద్రవ్యాలు, వాటి అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో చట్ట సంస్థల అవిశ్రాంత ప్రయత్నాలకు ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. మన సమాజం ఆరోగ్యం, భద్రతను కాపాడటంలో వారి సహకార ప్రయత్నాలు చాలా కీలకమని కొనియాడారు.
Kudos to Gujarat ATS and NCB (Ops), Delhi, for a massive win in the fight against drugs!
Recently, they raided a factory in Bhopal and seized MD and materials used to manufacture MD, with a staggering total value of ₹1814 crores!
This achievement showcases the tireless efforts… pic.twitter.com/BANCZJDSsA
— Harsh Sanghavi (@sanghaviharsh) October 6, 2024