జమ్మూ: జమ్మూకశ్మీర్లోని కనాచక్లో శుక్రవారం డ్రోన్ను కూల్చివేశారు. ఆ డ్రోన్ నుంచి 5 కిలోల పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉన్నది. బుధవారం కూడా సత్వారా ప్రాంతంలో ఓ డ్రోన్ సంచరించినట్లు అనుమానాలు ఉన్నాయి. జమ్మూ ఎయిర్బేస్ వద్ద అది ఆపరేట్ అవుతున్నట్లు ఎన్ఎస్జీ దళాలు మోహరించిన యాంటీ డ్రోన్ సిస్టమ్ పసికట్టింది. ఇటీవల జమ్మూ ఎయిర్బేస్ వద్ద డ్రోన్లు సంచరించిన ఘటనలు జరిగిన నేపథ్యంలో అక్కడ యాంటీ డ్రోన్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు.