ముంబై, మార్చి 20: మహారాష్ట్రలోని ముంబై ఎయిర్పోర్ట్లో రూ. 70 కోట్ల విలువైన హెరాయిన్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇథియోపియా నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడిని తనిఖీ చేసిన అధికారులు.. అతడి బ్యాగ్లో 9.97 కిలోల హెరాయిన్ను గుర్తించారు.
నగరంలోని ఓ నైజీరియా పౌరుడికి అతడు ఈ డ్రగ్స్ను సరఫరా చేస్తుండగా, అతడిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.