శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో (Jammu and Kashmir) ఉగ్ర మూకలతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై డాక్టర్, పోలీస్ సహా నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. ఎస్ఎంహెచ్ఎస్ హాస్పిటల్ శ్రీనగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ (మెడిసిన్) డాక్టర్ నిసారుల్ హసన్, కానిస్టేబుల్ (జమ్ము కశ్మీర్ పోలీస్) అబ్దుల్ మాజీద్ భట్, లేబరేటరీ బేరర్ అబ్ధుల్ సలాం రాదర్, టీచర్ ఫరూక్ అహ్మద్ మిర్లను సర్వీస్ నుంచి డిస్మిస్ చేసినట్టు అధికారులు వెల్లడించారు.
ఫరూక్ అహ్మద్ మిర్ను తొలుత 1994లో విద్యాశాఖలో నియమించగా ఆపై 2007లో టీచర్గా పదోన్నతి పొందారు. ఉగ్రవాదాన్ని కఠినంగా అణిచివేయడం, ఉక్కుపాదం మోపడమే తమ విధానమని, జమ్ము కశ్మీర్ను ఉగ్రవాద రహిత ప్రాంతంగా మలిచేందుకు ఎల్జీ యంత్రాంగం కట్టుబడి ఉందని ప్రభుత్వం పేర్కొంది.
గత మూడేండ్లుగా జమ్ము కశ్మీర్లో పాక్ ఉగ్ర మూకలకు సాయం అందిస్తున్నారనే ఆరోపణలపై దాదాపు 50 మందికి పైగా ఉద్యోగులను అధికార యంత్రాంగం విధుల నుంచి తొలగించింది. వీరిపై పాక్కు చెందిన ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు సాయం చేయడం, ఉగ్ర సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం, ఆర్ధిక సాయం అందించడం, వేర్పాటువాద అజెండాను ప్రేరేపించడం వంటి ఆరోపణలున్నాయి.
Read More :