Pamban Bridge | రైలు ప్రయాణం అంటేనే చాలామంది ఎంతో ఇష్టం. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాగే ప్రయాణం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చుట్టూ సముద్రం.. రైలును తాకే అలల మధ్య సాగే ప్రయాణం మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది. ఈ రైలు ప్రయాణం తమిళనాడు రామేశ్వరం దీవిని ప్రధాన భూభాగంతో కలిపే పంబన్ వంతెన మీదుగా ప్రయాణం చేయాల్సిందే తప్ప.. మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది. బ్రిటీష్ కాలంలో నిర్మించి వంతెన శిథిలావస్థకు చేరుకోగా.. భారతీయ రైల్వే కొత్త వంతెన నిర్మించింది. శ్రీరామనవమి సందర్భంగా ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జాతికి అంకితం చేయనున్నారు.
రామేశ్వరం ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో కలిపే కొత్త పంబన్ వంతెనను రైల్వేశాఖ నిర్మించింది. పాత రైల్వే వంతెన శిథిలావస్థకు చేరడంతో దాన్ని మూసివేసింది. ఆ వంతెన స్థానంలో కొత్తగా వంతెనను నిర్మించింది. గతకొద్దిరోజుల కిందట నిర్మాణం పూర్తయ్యింది. ట్రయల్ రన్ సైతం విజయవంతం కావడంతో వంతెనను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. సముద్రం గుండా ఎలాంటి ఆటంకం లేకుండా నౌకలు వెళ్లేలా ఏర్పాటు చేసిన వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిని తొలిసారిగా సముద్రం మధ్యలో 17 మీటర్ల ఎత్తులో రూ.550 కోట్ల వ్యయంతో నిర్మించారు. తమిళనాడులోని రామేశ్వరం మండపం జిల్లా పట్టణం నుంచి బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవికి వెళ్లాలంటే.. కేవలం సముద్ర మీదుగానే ప్రయాణం చేయాల్సిందే. రెండు ప్రాంతాలను సముద్ర మార్గాన్ని లింక్ చేసేలా పంబన్ రైల్వే వంతెనను నిర్మించారు. అవసరానికి అనుగుణంగా లిఫ్ట్ చేసేలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సిబుల్ బ్రిడ్జి. దేశంలోనే తొలి వర్టికల్ బ్రిడ్జి కావడం విశేషం. ఈ
ఈ రైలు వంతెన నిర్మాణ పనులను 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) వంతెన పనులు ప్రారంభించింది. నాలుగేళ్లలోనే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసింది. వంతెనపై 600 మీటర్ల పరిధిలో భారీ సైజు వర్టికల్ లిఫ్ట్ని ఏర్పాటు చేసింది. ఆ పనులు పూర్తికావడానికి ఐదు నెలల సమయం పట్టింది. ఈ లిఫ్ట్ బరువు 660 టన్నులు ఉటుంది. పొడువు 72.5 మీటర్లు. పంబన్ వంతెన సముద్రంలో 2.08 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. వంతెన కింద నుంచి ఓడలు ఎలాంటి ఆటంకాలు లేకుండా రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. వంతెనకు రెండువైపులా భారీ స్తంభాలుంటాయి. వాటికి 320 టన్నుల బరువున్న దూలాలు వేలాడుతుంటాయి. 625 టన్నులు బరువు ఉంటాయి.
పంబన్ వంతనపై ఉండే వర్టికల్ లిఫ్ట్లో సుమారు 35 టన్నుల బరువు ఎత్తడానికి మాత్రమే విద్యుత్ సరఫరా అవసరం. వంతెనను ఎత్తాల్సి వచ్చినప్పుడు కింద లిఫ్ట్లు, మోటార్లు పైకి లిఫ్ట్ చేస్తాయి. రిమోట్ కంట్రోల్ ద్వారానే ఆపరేట్ చేస్తారు. పంబన్ సముద్రం అడుగున గట్టి నేల తగిలే వరకూ 25-35 మీటర్ల లోతున పునాదులు నిర్మించారు. ప్రపంచంలోనే ఎక్కువగా తుప్పు పట్టే రెండో ప్రాంతంగా పంబన్ ప్రాంతానికి పేరుంది. సముద్రం అలలు పంబన్ వంతెనపైకి వరకు వస్తుంటాయి. ఇనుము పట్టాలు కావడంతో తప్పుపడుతుంటాయి. అయితే, దాదాపు 104 సంవత్సరాల కిందట నిర్మించిన పంబన్ వంతెన ఇనుము తుప్పు పట్టింది. దాని స్థానంలోనే కేంద్రం కొత్తగా వంతెనను నిర్మించింది. పత వంతెనను బ్రిటిష్ కాలంలో నిర్మించారు. ఈ వంతెన 1914లో ప్రారంభించారు. అప్పటి వరకు దాదాపు వందేళ్లకుపైగా సేవలందించింది.
కొత్త వంతెనకు తుప్పు సమస్య రాకుండా మూడు పొరల పాలీసిలోక్సేన్ పెయింట్ వేశారు. దాంతో 58 సంవత్సరాల వరకు తుప్పు ముప్పు ఉండదు. చిన్న చిన్న మరమ్మతులు చేస్తే వందేళ్ల వరకు ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగించొచ్చు. సముద్రంలో వేసిన దిమ్మెలకు ఇబ్బంది కలుగకుండా కేసింగ్ విధానంలో ఐరన్ చట్రాలతో కాంక్రీట్ వేశారు. వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిలో ఒక బోల్డును వాకపోడం విశేషం. అన్నీ వెల్డింగ్తోనే జోడించారు. వంతెన మొత్తాన్ని స్కాడా సెన్సర్లతో లింక్ చేయగా.. గంటకు 58 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తే స్కాడా సెన్నార్లు ఆటోమేటిక్గా వంతెనను మూసివేస్తాయి. మత్స్యకారుల పడవలు, నేవీ, పోర్టుల నుంచి వచ్చే ఓడలు వంతెనను దాటాల్సి వచ్చిన సమయంలో సిబ్బంది దిమ్మెల వద్ద ఏర్పాటు చేసిన గదుల్లోకి వెళ్లి రిమోట్ ద్వారా వంతెనను లిఫ్ట్ చేస్తారు. చాలా రోజుల తర్వాత పంబన్ రైలు వంతెన మీదుగా ప్రయాణం సాగించనుండడంతో రామేశ్వరానికి వెళ్లే భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.