Budget 2024 : పార్లమెంట్లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై విపక్షాలు పెదవివిరిచాయి. ధరల పోటు, ద్రవ్య లోటు మినహా బడ్జెట్లో ఏమీ లేదని విరుచుకుపడ్డాయి. ఇక మధ్యంతర బడ్జెట్పై డీఎంకే ఎంపీ టీ శివ స్పందించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి విజయం సాధిస్తుందని, ఎన్నికల అనంతరం తమ కూటమి మెరుగైన బడ్జెట్ను ప్రవేశపెడుతుందని శివ ధీమా వ్యక్తం చేశారు.
రానున్న ఎన్నికల అనంతరం పూర్తిస్ధాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని కాషాయ పాలకులు కోరుకుంటున్నారని, అయితే ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొంది ఆపై మెరుగైన బడ్జెట్ను ప్రవేశపెడుతుందని డీఎంకే ఎంపీ స్పష్టం చేశారు. ఇక భారత్ను 2047 నాటికి వికసిత భారత్గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
లోక్సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ సర్కార్ చిట్ట చివరి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆమె పార్లమెంట్లో మాట్లాడుతూ.. దేశ ప్రజల సగటు ఆదాయం 50 శాతం పెరిగిందని అన్నారు. గడిచిన పదేళ్లలో మహిళల సాధికారత పెరిగిందన్నారు. ట్రిపుల్ తలాక్ను చట్టరీత్యా నేరం చేశామన్నారు. ప్రభుత్వ స్కీమ్ కింద 70 శాతం మంది మహిళలకు ఇండ్లు అందజేసినట్లు చెప్పారు.
Read More :
Budget 2024 | కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్..! బడ్జెట్లో ఆర్థిక మంత్రి