Water Crisis : గత 30, 40 ఏండ్లలో రాష్ట్రం ఇంతటి తీవ్ర కరవును చూడలేదని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. బెంగళూర్లో నీటి సంక్షోభంపై స్పందిస్తూ గతంలో కరవు తాండవించినా తామెన్నడూ ఇంత పెద్దసంఖ్యలో తాలూకాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించలేదని పేర్కొన్నారు.
బెంగళూర్ నగరంలో 13,900 బోర్వెల్స్లో 6,900 బోర్లు ఎండిపోయాయని చెప్పారు. కర్నాటక ప్రభుత్వం రంగంలోకి దిగి ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా సాగిస్తోందని తెలిపారు. బెంగళూర్ నగరానికి అవసరమైన మేర కావేరీ జలాలు రావడం లేదని వివరించారు.
గత ఏడాది సరిపడినంత వర్షపాతం నమోదవకపోవడంతో బెంగళూర్లో ఎన్నడూ లేని విధంగా నీటి సంక్షోభం తలెత్తడంతో 60 శాతం మంది పైగా నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్ధితి నెలకొంది.
Read More
Bhatti Vikramarka | యాదాద్రిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం