యాదగిరిగుట్ట: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు (Bhatti Vikramarka) అవమానం జరిగింది. యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిపూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. సీఎంతోపాటు ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, కొండా సురేఖ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ్యమత్రి దంపతులు, మంత్రులకు ఆలయ పండితులు ఆశీర్వనం అందించారు.
ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, సురేఖ పీటలపై ఆసీనులయ్యారు. ఉమముఖ్యమంత్రి భట్టికి పీట లేకపోవడంతో కింద కూర్చుకున్నారు. కాగా, సీఎం దంపతులు, మంత్రులకు ఆలయ పండితులు కంకణధారణ చేసి, వేదాశీర్వచనం అందించారు.