DK Shivakumar : అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ట వేడుకల సందర్భంగా ఈనెల 22న సెలవు ప్రకటించరాదని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కర్నటక డిప్యూటీ సీఎం డీకే సిద్ధరామయ్య సమర్ధించుకున్నారు. తమ మతం, భక్తి, విశ్వాసాలను తాము ప్రచారం చేసుకోబోమని అన్నారు. ఆలయాల్లో తమ మంత్రులు పూజలు చేస్తున్నారని, తమ పూజలు ఫలిస్తాయని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు.
అందరూ ప్రార్ధనలు చేయాలని తాము కోరుతున్నామని చెప్పారు. సిద్ధరామయ్య పేరులో రామ ఉందని, తన పేరుల శివ ఉందని, తమను ఏ ఒక్కరూ ఒత్తిడి చేయలేరని అన్నారు. తమ కర్తవ్యాన్ని తాము నెరవేరుస్తామని చెప్పారు. అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఈనెల 22న సెలవు ప్రకటించకపోవడంపై కర్నాటక ప్రభుత్వం లక్ష్యంగా బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.
జనవరి 22న పలు రాష్ట్రాలు సెలవు ప్రకటించాయి. మరోవైపు అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ వేడుకలకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు హాజరు కావడం లేదు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని మోదీ సర్కార్ కొందరు ఎంపిక చేసిన నేతలు, సీఎంలనే ఆహ్వానిస్తోందని, దేశంలో ఎందరో నేతలు, సీఎంలు ఉన్నారని డీకే శివకుమార్ అన్నారు. అయోధ్య రామాలయం ప్రైవేట్ ఆస్తి కాదని, అది ప్రజల సొత్తు అని ఏ మతం, చిహ్నం ఏ ఒక్క వ్యక్తీకి చెందినది కాదని పేర్కొన్నారు.
Read More :
Health Tips | రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకోకుండా ఉండాలంటే ఈ ఫ్రూట్ తినండి!