Maharashtra | మహారాష్ట్రలో కేబినెట్ విస్తరణ అనంతరం ఎట్టకేలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంత్రులకు శాఖలను కేటాయించారు. పట్టణాభివృద్ధి, పర్యావరణం, మైనారిటీలు, రవాణా, విపత్తు నిర్వహణ బాధ్యలను సీఎం తీసుకోగా.. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్రవిస్కు హోంశాఖతో పాటు ఆర్థికశాఖను కేటాయించారు. రెవెన్యూ, పశుసంవర్ధక, డెయిరీ డెవలప్మెంట్ శాఖలను రాధాకృష్ణ విఖే పాటిల్కు, సుధీర్ ముంగంటివార్కు అటవీ, సాంస్కృతిక వ్యవహారాలు, మత్స్య సంపద, చంద్రకాంత్ పాటిల్ ఉన్నత, సాంకేతిక విద్య, టెక్స్టైల్, పార్లమెంటరీ అఫైర్స్ బాధ్యతలను అప్పగించారు.
విజయ్కుమార్ గావిట్కు ట్రైబల్ డెవలప్మెంట్, గిరిష్ మహాజన్కు రూరల్ డెవలప్మెంట్, పంచాయత్రాజ్, మెడికల్ ఎడ్యూకేషన్, క్రీడలు, యువజన సంక్షేమశాఖలు, గులాబ్రావ్ పాటిల్కు నీటి సరఫరా, పారిశుధ్యం, దాదా స్ట్రాకు ఓడరేవులు, మైనింగ్ శాఖలను కేటాయించారు. సంజయ్ రాథోడ్కు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, సురేష్ ఖడేకు కార్మికశాఖ, సందీపన్ బూమ్రేకు ఉద్యానవన, ఎప్లామెంట్ గ్యారంటీ స్కీమ్ బాధ్యతలను అప్పగించారు. ఉదయ్ సామంత్కు పరిశ్రమలశాఖ, తానాజీ సామంత్కు పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్, రవీంద్ర చవాన్కు పబ్లిక్ వర్క్స్, సివిల్ సప్లై, వినియోగదారుల సంక్షేమశాఖ, దీపక్ కేసర్కార్కు పాఠశాల విద్య, మరాఠీ భాష శాఖ కేటాయించారు.
అతుల్కు సహకార, సంక్షేమశాఖ, శంభురన్ దేశాయ్ ఎక్సైజ్, మంగళ్ ప్రబత్ లోదాకు టూరిజం, స్కిల్ డెవలప్మెంట్, స్త్రీ శిశు సంక్షేమశాఖ బాధ్యతలను కేటాయించారు. ఇదిలా ఉండగా.. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పడిపోయిన అనంతరం సీఎంగా ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవస్గా ప్రమాణం చేయగా.. దాదాపు 40 రోజుల తర్వాత షిండే కేబినెట్ కొలువుదీరింది. ఈ నెల 9న మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. శివసేన నుంచి తొమ్మిది, బీజేపీ నుంచి తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయగా.. సీఎం, డిప్యూటీ సీఎంతో సహా కలిపి కేబినెట్లో మంత్రుల సంఖ్య 20కి చేరుకుంది.