Dimple Yadav | ఓటర్లను బీజేపీ నాయకులు కొంటున్నారని సమాజ్వాదీ పార్టీ నాయకురాలు డింపుల్ యాదవ్ ఆరోపించారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ మృతితో ఖాళీ అయిన ఉత్తర్ప్రదేశ్లోని మెయిన్పురి లోక్సభ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ స్థానానికి నేడు ఉప ఎన్నిక జరుగుతోంది.
మద్యం, డబ్బులతో ఓటర్లను బీజేపీ నాయకులు ప్రలోభపెడుతున్నారని ఈ సందర్భంగా ఆమె విమర్శించారు. ‘వందలాది మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు మెయిన్పూరి స్టేషన్ రోడ్డులో గల పాల్మ్ హోటల్కు చేరారు. అక్కడి నుంచే ఓటర్లకు వారు మద్యం, డబ్బు పంచుతున్నారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలి’ అంటూ ట్వీట్ చేశారు.
होटल पाम, स्टेशन रोड, मैनपुरी में सैकड़ों की संख्या में भाजपा नेता, कार्यकर्ता इकट्ठे होकर निरंतर शराब और पैसा बंटवा रहे हैं।
मामले का संज्ञान ले चुनाव आयोग। @ceoup @ECISVEEP
— Dimple Yadav (@dimpleyadav) December 4, 2022