న్యూఢిల్లీ : దేశంలో ఆర్థిక సరళీకరణకు పునాది వేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక వ్యవస్థ గురించి హెచ్చరించారు. 1991 లో దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత ఘోరంగా ఉన్నదో, రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి రాబోతున్నదని హెచ్చరిక స్వరంలో చెప్పారు. దీనికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలన్నారు. ఇది సంతోషంగా, ఉల్లాసంగా ఉండవలసిన సమయం కాదని, ఆత్మపరిశీలన చేసుకునే సమయమని మన్మోహన్సింగ్ ఉద్ఘాటించారు. 1991 సంక్షోభం కంటే ముందుకు వెళ్ళే మార్గం చాలా సవాలుగా ఉంటుందన్నారు. ప్రతి భారతీయుడికి ఆరోగ్యకరమైన, గౌరవప్రదమైన జీవితాన్ని నిర్ధారించడానికి, దేశంగా మన ప్రాధాన్యతలను పునర్నిర్వచించాల్సిన అవసరం ఉన్నదని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు.
పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా చేరిన మన్మోహన్సింగ్ 1991 లో సరిగ్గా ఇదే రోజున ప్రవేశపెట్టిన బడ్జెట్.. దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేసిందని చెప్పవచ్చు. ఈ చారిత్రాత్మక బడ్జెట్ ప్రవేశపెట్టి 30 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా.. మన్మోహన్ సింగ్ శుక్రవారం అనేక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
‘అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు మార్గదర్శనంలో కాంగ్రెస్లోని చాలా మంది సహచరులతో కలిసి ఈ సంస్కరణల ప్రక్రియలో పాత్ర పోషించడం అదృష్టంగా భావిస్తున్నాను. గత మూడు దశాబ్దాలలో మన దేశం అద్భుతమైన ఆర్థిక పురోగతి సాధించిందిజ ఇది నాకు చాలా ఆనందంగా, గర్వంగా ఉన్నది. దాదాపు 30 కోట్ల మంది భారతీయ పౌరులు పేదరికం నుంచి బయటకు రాగలిగారు. కోటి కొత్త ఉద్యోగాలు సృష్టించాం’ అని మన్మోహన్సింగ్ చెప్పారు. కరోనా వైరస్ కారణంగా కలుగుతున్న వినాశనం, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవడం పట్ల తాను చాలా బాధపడుతున్నానని అన్నారు. ఆరోగ్యం, విద్య సామాజిక రంగాలు వెనుకబడి ఉన్నాయని, మన ఆర్థిక పురోగతికి అనుగుణంగా లేవని తెలిపారు. కరోనా వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, ఉద్యోగాలు పోవడం ఊహించని నష్టమని విచారం వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ నుంచి చిన్నారులకు కరోనా టీకాలు : గులేరియా
ఐఏఎస్ అధికారి నివాసంలో సీబీఐ తనిఖీలు
రాజ్ కుంద్ర సంస్థకు శిల్పాశెట్టి రాజీనామా
చరిత్రలో ఈరోజు.. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చిన బడ్జెట్ ఇది
పైకి పెరిగిన భూమి.. హర్యానాలో వింత సంఘటన!.. వీడియో వైరల్..
ఈ శాండ్విచ్ చాలా కాస్లీ గురూ!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..