న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ మరోసారి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జిపై విరుచుకుపడ్డారు. ఎన్నికల ఫలితాలు ముందే తెలిసిపోవడానికి బీజేపీ ఏమైనా దైవమా..? అని మమతా బెనర్జి వేసిన ప్రశ్నపై ఆయన స్పందించారు. తాము దైవాలము కాదని, ప్రజాసేవ కోసం అంకితమైన సాధారణ మనుషులమేనని ఆయన చెప్పారు.
అయితే, రెండో విడుత పోలింగ్ సందర్భంగా నందిగ్రామ్లోని ఓ పోలింగ్ బూత్లో మమతా బెనర్జి డ్రామాలు ఆడిన రోజే తృణమూల్ ఓడిపోతుందనే విషయం దేశానికి తెలిసిపోయిందన్నారు. దీదీ.. నందిగ్రామ్లోని ఓ పోలింగ్ బూత్లో మీరు ఆటలు ఆడిన రోజే మీ పరాజయం గురించి దేశ ప్రజలకు తెలిసిపోయింది అని ఆయన వ్యాఖ్యానించారు. బెంగాలీలు బీజేపీపైన చూపిస్తున్న ప్రేమను వారికి అభివృద్ధి రూపంలో తిరిగి ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణను నియమించిన రాష్ట్రపతి
తమిళనాడులో ఓటేసిన గవర్నర్ తమిళిసై
ఓటు వేసిన డీఎంకే చీఫ్ స్టాలిన్
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
పోలింగ్ బూత్లో పేలిన నాటు బాంబు
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్