– మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నియామక పత్రం అందజేత
భద్రాచలం, జూలై 11 : భద్రాచలంకు చెందిన జెట్టి రామకృష్ణ యాదవ్ ను జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ యాదవ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిగె శ్రీనివాస యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. నియామక పత్రాన్ని శనివారం హైదరాబాద్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ చేతుల మీదుగా నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జెట్టి రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. తనపై ఉంచిన నమ్మకానికి సంస్థ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. యాదవుల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాననన్నారు. జిల్లాలో యాదవ యువతను సంఘటితం చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా కృషి చేస్తానని తెలిపారు.