న్యూఢిల్లీ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అంబరానికి విస్తరించాయి. వేడుకలతో దేశం పులకరించిపోతున్న వేళ మువ్వన్నెల పతాకం అంతరిక్షం అంచున రెపరెపలాడింది. అంతరిక్ష కేంద్రంలో భారత పతాకాన్ని ఆవిష్కరించిన ఫొటోను భారత సంతతికి చెందిన వ్యోమగామి రాజాచారి షేర్ చేశారు.
‘భారత స్వాతంత్య్ర దినోత్సవం వేళ ప్రవాస భారతీయుడిగా నా తండ్రి నగరమైన హైదరాబాద్ ఎలా వెలిగిపోతుందో రోదసి నుంచి వీక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. చెన్నై కేంద్రంగా కృషిచేస్తున్న ‘స్పేస్కిడ్జ్’ సంస్థ ఏకంగా అంతరిక్షంలోనే జెండా ఆవిష్కరించింది.
హీలియం బెలూన్కు జతచేసిన పతాకాన్ని ఈ ఏడాది జనవరి 27న చెన్నై నుంచి ‘బెలూన్శాట్’ ద్వారా నింగిలోకి పంపింది. ఇది భూగోళానికి దాదాపు 30 కిలోమీటర్ల ఎత్తున (వాతావరణ ఎగువ ప్రాంతంలో) విచ్చుకొని ఖగోళంలో రెపరెపలాడింది. ఈ వీడియోను స్పేస్కిడ్జ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఐరోపాలోనే అత్యంత ఎత్తయిన ఎల్బ్రుస్ పర్వత శిఖరంపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న పర్వతారోహకురాలు భావన దెహారియా