న్యూఢిల్లీ : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విమానాల్లో కరోనా మార్గదర్శకాలు కఠినంగా అమలుచేయాలని అన్ని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాలు జారీచేసింది.
మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేయాలని స్పష్టంచేసింది. నిబంధనలు అమలుచేస్తున్నారా లేదా అనేదానిపై తనిఖీలు చేపడుతామని పేర్కొన్నది. ప్రయాణికులు కరోనా మార్గదర్శకాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.