Sabarimala Temple | కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల (Sabarimala Temple) భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. కొండ మొత్తం అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోతోంది. స్వామి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈ ఏడాది మండల- మకరవిళక్కు వేడుకలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో మండల పూజల కోసం శబరిమల ఆలయాన్ని అధికారులు గురువారం సాయంత్రం తెరిచారు. ఇక రెండు నెలల పాటు సాగే దర్శనాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులను అయ్యప్ప దర్శనానికి అనుమతిస్తున్నారు.
#WATCH | Kerala: Devotees throng Sabarimala Sree Dharma Sastha Temple, Pathanamthitta for darshan.
The temple is open for a two-month-long pilgrim season. pic.twitter.com/pSlHcuM138
— ANI (@ANI) November 18, 2023
దీంతో స్వామి దర్శనం కోసం కేరళ నుంచే కాకుండా పొరుగున ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు శబరిమల కొండకు తరలివెళ్తున్నారు. మరోవైపు రెండు నెలల పాటు సాగే స్వామి దర్శనాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయ్యప్ప స్వామి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేరళ మంత్రి కే రాధాకృష్ణన్ తెలిపారు. భక్తుల సౌకర్యం కోసం అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నట్టు తెలిపారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు డైనమిక్ క్యూ కంట్రోల్ సిస్టమ్ను అమలు చేస్తున్నామన్నారు.
#WATCH | Kerala: The doors of Sabarimala Sree Dharma Sastha Temple were opened for darshan.
The temple is open for a two-month-long pilgrim season. pic.twitter.com/Mw5zMWxVju— ANI (@ANI) November 18, 2023
Also Read..
Badrinath temple | నేటి నుంచి బద్రీనాథ్ ఆలయం మూసివేత.. 15 క్వింటాళ్ల పూలతో ముస్తాబు
Amazon LayOffs | అమెజాన్లో మరోసారి కొలువుల కోత.. అలెక్సా యూనిట్లో వందలమందిపై వేటు
Naga Chaitanya | సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నాగచైతన్య